Breaking News

సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ఆధ్వరంలో మండల సర్వసభ్య సమావేశం

తెలుగు తేజం, కంచికచర్ల : సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక కంచికచర్ల మరియు వీరులపాడు మండల సర్వసభ్య సమావేశం కంచికచర్ల లోని స్థానిక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆఫీస్ లో బుధవారం జరిగింది. ఈ సమావేశంలో అతిథిగా జిల్లా అధ్యక్షులు కె. ధర్మరాజు అధ్యక్షత వహించి ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మండలాల్లోని అన్ని గ్రామాల్లో గతంలో జరిగిన గ్రామ సభలు సరిగా జరగలేదని భవిష్యత్తులోనైనా గ్రామ సభలు నిర్వహించాలని తద్వారా గ్రామాల అభివృద్ధికి సమాచార ఐక్య వేదిక సభ్యులు గ్రామాల్లోని ఓటరు గ్రామ సభల ఆవశ్యకతను తెలియజేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కె. ధర్మరాజు జిల్లా ఉపాధ్యక్షులు బుడ్డి సూర్య ప్రకాష్ మండల అధ్యక్షులు గుదే రాంబాబు కోశాధికారి ఇ నాగేశ్వరరావు వీరులపాడు ఉపాధ్యక్షులు కోట సురేష్ మండల ఉపాధ్యక్షులు జిల్లాపల్లి ఇందిరా మరియు గోగినేని రవి , షేక్ జాన్ సైదా మరియు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *