![](https://telugutejamnews.com/wp-content/uploads/2023/09/tdp-2-765x510.jpg)
దిల్లీ: దిల్లీలో మహాత్మాగాంధీ సమాధి రాజ్ఘాట్లో తెదేపా నేతలు నివాళులర్పించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్తో ఆ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు, పలువురు ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ అక్కడే మౌనదీక్ష చేపట్టారు.