Breaking News

అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాటి ఉజేలా కు తప్పిన పెను ప్రమాదం

తెలుగు తేజం, నందిగామ : కృష్ణాజిల్లా నందిగామ కంచికచర్ల పట్టణం శివారు ద్విచక్ర వాహనాన్ని అడిషనల్ డిజిపి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహన దారుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షత్రగాత్రుణ్ణి 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద బాధితున్ని కంచికచర్ల పట్టణానికి చెందిన కర్రీ నరసింహారావు గా గుర్తించారు. కారు అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి రహదారి ఉన్న కందకం లోకి దూసుకెల్లింది. ఈ కారులో ప్రయాణీసుతన్న అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాటి ఉజేలా సురక్షితం ఎటువంటి ప్రమాదం లేకుండా బయట పడ్డారు. ఆయన్నుసెక్యూరిటీ సిబంది వెంటనే వేరొక కారులో తరిలించారు. ఈ సమాచారం అందుకున్న కంచికచర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *