Breaking News

అధికారం మాటున అడ్డదారులు

తెలుగుతేజం, వత్సవాయి :ప్రజలకు అండగా ఉంటారని అధికారమిస్తే తే అండ చూసుకొని అడ్డదారులు తొక్కుతున్నారు. రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులు అధికారం ఇచ్చిన ప్రజల శ్రేయస్సు తుంగలో తొక్కి అక్రమ వ్యాపారాలకు కొమ్ముకాస్తున్నారు. కొందరు నాయకులు మండలంలోని పెండ్యాల వారి గూడెం గ్రామానికి చెందిన ఒక అధికార పార్టీ కి చెందిన బడా నాయకుడు తన తమ్ముని అడ్డుపెట్టుకొని అక్రమ రేషన్ వ్యాపారాన్ని ఇష్టం వచ్చినట్లు చేస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఈ నాయకుడు గ్రామం తెలంగాణ రాష్ట్రానికి అనుకొని ఉండటంతో అక్కడ తక్కువ రూపాయలకు కొనుగోలు చేసి ఇక్కడ నుండి బహిరంగంగానే వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం నేరం నిజమైనప్పటికీ అధికారులు మాత్రం తనకేమీ తెలియనట్లు ఉదారం గా వ్యవహరిస్తున్నారు. ఈ బడా నాయకుడు మేనల్లుడు ఆంధ్రాలో తెలంగాణ మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు ఉన్నప్పటికీ అక్కడి నుండి పెద్ద ఎత్తున మద్యన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి అధిక మొత్తంలో ఎక్కువ రెట్లు అమ్మకాలు జరుపుతున్నారు ఇంత జరుగుతున్నా ఇదేమని ప్రశ్నించేందుకు అధికారులు మాత్రం ముందుకు రావడం లేదు. దీనికి కారణం రాజకీయ నాయకుల నుండి అధికారులకు వత్తిళ్లు ఉన్నాయి అన్న మాట వినిపిస్తోంది. ఏదేమైనా అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ప్రజలకు సేవ చేయాల్సిన రాజకీయ నాయకులు తమ కుటుంబ సభ్యులతో అక్రమ వ్యాపారాలు చేయించి లక్ష రూపాయలు దండుకొని ప్రజలను విస్మరిస్తున్నారు అన్న మాటలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి… ఇంత జరుగుతున్నా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం ఏంటి అని ప్రజలు గుసగుసలాడుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *