Breaking News

అనుమంచిపల్లిలో టాటా ట్రస్ట్ సహకారం తో సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ స్వచ్చంధ సంస్థ ఆధ్వరంలో బ్యూటిషియన్ శిక్షణ

తెలుగు తేజం , జగ్గయ్యపేట : కృష్ణాజిల్లా జగయ్యపేట నియోజకవర్గం, జగ్గయ్యపేట మండలం, అనుమంచిపల్లి గ్రామంలో యువతులకు సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ అను స్వచ్చంధ సంస్థ వారు టాటా ట్రస్ట్ సహకారం తో బ్యూటిషిన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాని మాజీ ఎంపీటీసీ మెంబెర్ శ్రీమతి పానుగంటి రావులమ్మ మరియు సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ చంద్రరావు చేతుల మీద ప్రారంభించటం జరిగింది. ముందుగా జగ్గయ్యపేట నియోజకవర్గం సమన్వయకర్త యం. రాజేశ్వరరావు మాడ్లాడుతూ గత 4 సంవత్సరాలనుండి ఈ ప్రాంతంలో అనేక మంది యువతి యువకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి జీవనోపాధి కల్పించడం జరిగింది. శ్రీమతి పానుగంటి రావులమ్మ మాట్లాడుతూ సెంటర్ ఫర్ పీపుల్స్ వారు మన గ్రామంలో ఈ శిక్షణ నిర్వహించడం చాలా సంతోషం గా బావించాలి అదేవిదంగా మన ప్రాంతంలో వివిధ శిక్షణలు నిర్వహించి అనేక మంది జీవనోపాధి కల్పిస్తున్నారు. ఈ శిక్షణ మన గ్రామం లో నిర్వహించడం చాలా సంతోషకరం ఈ అవకాశని అందరు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. శ్రీ అల్లాబక్షు షేక్ మాట్లాడుతూ మా సంస్థ 2006 నుండి ఫారెస్ట్ ప్రాంతాలలో మరియు రూరల్ ప్రాంతంలో అనేక అభివృద్ధి మరియు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో నియోజకవర్గం సమన్వయ కర్త యం .రాజేశ్వరరావు ,కిరణ్ కుమార్ ట్రైనర్ రమ్య , స్కిల్ మిత్రలు , పుష్పలత ,వెంకటేశ్వర్లు మరియు 15 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ 45 రోజులు ఉంటుంది, 15 మంది మహిళలకు అవకాశం కలదు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *