Breaking News

ఆసరా సేవా సంస్థ ఆధ్వర్యంలో గో పూజ మరియు దేవాలయాల్లో పండ్ల మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ఎస్ఐ చినబాబు

తెలుగు తేజం, జగ్గయ్యపేట : జగ్గయ్య పేట పట్టణ పరిధిలోని స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆసరా సేవా సంస్థ ఆధ్వర్యంలో గో పూజ మరియు దేవాలయ ప్రాంగణంలో పండ్ల మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రత్యేక అతిధిగా పట్టణ ఎస్ఐ చినబాబు పాల్గొన్నారు. ముందుగా గో మాత కు ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయ ప్రాంగణం చుట్టూ పండ్ల మొక్కలు సంస్థ ప్రతినిధులతో కలిసి వేయడం జరిగింది అని ఆసరా సేవా సంస్థ కృష్ణాజిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ పోటు అయ్యన్న తెలియజేశారు ఆసరా ఫౌండేషన్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పాత కోటి సాయి గణేష్ పర్యవేక్షణలో వత్సవాయి మండల కోఆర్డినేటర్ షేక్ నాగుల్ మీరా మరియు ప్రధాన కార్యదర్శి షేక్ సల్మా సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రోగ్రాం కోఆర్డినేటర్ అయ్యన్న తెలియజేశారు జగ్గయ్యపేట పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమానికి పట్టణ ఎస్ఐ చిన్నబాబు తో పాటు దేవాలయ కమిటీ సభ్యులు జనార్ధన్ రామారావు పలువురు పెద్దలు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *