Breaking News

ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రాజశేఖర్‌

హైదరాబాద్‌: సినీ నటుడు రాజశేఖర్‌ కరోనాను జయించారు. తాజాగా చేసిన పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో సినీ న్యూరో సెంటర్‌ ఫర్‌ సర్వీస్‌ నుంచి ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు. తన సతీమణి జీవితతో కలిసి రాజశేఖర్‌ దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

గత కొన్ని రోజుల కిందట రాజశేఖర్‌ కరోనా బారిన పడగా, చికిత్స నిమిత్తం సిటీ న్యూరో సెంటర్‌ ఫర్‌ సర్వీస్‌లో చేరారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. వెంటిలేటర్‌పై ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటన్నింటినీ ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ ఆయనకు ఎప్పుడూ వెంటిలేటర్‌ మీద చికిత్స అందించలేదని, ఆ వార్తలు అవాస్తవమని జీవిత పేర్కొన్నారు. ఐసీయూలోనే ఆక్సిజన్‌ అందిస్తూ చికిత్స చేశారని వివరించారు. అనంతరం ప్లాస్మా థెరపీ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తాజాగా రాజశేఖర్‌ ఆరోగ్యం మెరుగు పడటంతో డిశ్చార్జి చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *