Breaking News

ఇంద్రకీలాద్రిపై ఘనంగా రథసప్తమి వేడుకలు

తెలుగు తేజం, విజయవాడ : రథసప్తమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో వేదపండితులు సూర్యోపాసన సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యాగశాలలో చండీ హోమం, మల్లేశ్వరస్వామి ఆలయంలోని మండపంలో శాంతి కల్యాణం, అమ్మవారి ప్రధాన ఆలయం వద్ద శ్రీచక్ర నవావర్ణార్చన, లక్ష కుంకుమ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పంచహారతుల అనంతరం దుర్గామల్లేశ్వరస్వామివార్ల ఉత్సవమూర్తులకు వైభవంగా పల్లకీ సేవ నిర్వహించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *