Breaking News

‘జగనన్న విద్యాకానుక’ లాంటి పథకం దేశంలో మరెక్కడా లేదు : మంత్రి సురేష్

తెలుగు తేజం , అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న విద్యాకానుక’ లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పుకొచ్చారు. ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇటీవల సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన విద్యాకానుకపై మాట్లాడుతూ ప్రజలు సంతోషంగా ఉంటే ప్రతిపక్షానికి బాధ అని మంత్రి అన్నారు. ‘జగనన్న విద్యా కానుక’పై బహిరంగ చర్చకు సిద్ధం అంటూ ఆయన ఒకింత సవాల్ విసిరారు. జగన్ ప్రవేశపెట్టిన ఈ పథకానికి సంబంధించి మిగిలిన రాష్ట్రాలు ఆరా తీస్తున్నాయన్నారు. ‘జగన్ స్టిక్కర్ సీఎం కాదు.. స్ట్రైకింగ్ సీఎం’ అని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వానికి వచ్చినన్ని మంచి ఆలోచనలు టీడీపీకి ఎప్పుడైనా వచ్చాయా..? అని ఈ సందర్భంగా సురేష్ ప్రశ్నించారు. జగనన్న చెప్పాడంటే.. చేస్తాడంతే అని ప్రజలు అనుకుంటారని తెలిపారు.

ప్రతిపక్షాల విమర్శలపై..

జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రతి రోజూ 50 కిట్లకు మించకుండా జగనన్న విద్యా కానుక పంపిణీ జరుగుతోంది. జగనన్న విద్యా కానుక కార్యక్రమం మీద ప్రతిపక్షం బురద జల్లుతోంది. మంచి కార్యక్రమాన్ని చూసి ప్రతిపక్షం కడుపు రగిలిపోతోంది. కేంద్రం నిధులతో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారంటూ అవాకులు చెవాకులు పేలుతున్నారు. 43 లక్షల మంది విద్యార్ధులు లబ్ది పొందుతున్నారు.స్కూల్ బ్యాగులకు మొత్తం రూ. 69 కోట్లు ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. నోట్ బుక్స్, షూస్, బెల్టుల ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.యూనిఫాం, టెక్స్ట్‌ పుస్తకాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చింది’ అని ప్రతిపక్షాల ఆరోపణలపై మంత్రి పై విధంగా స్సందించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *