Breaking News

ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలి

ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించిన డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

తెలుగు తేజం : ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పేర్కొన్నారు ,ఇళ్ల పట్టాల పంపిణీకీ సంబంధించి స్థానిక పార్టీ కార్యాలయంలో నాలుగు మండలాల ముఖ్య నాయకులతో మంగళవారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు , ఈ సందర్భంగా డా”అరుణ్ కుమార్ మాట్లాడుతూ పార్టీ నాయకులు అధికారులకు సహకరించి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ,ముఖ్యంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం ప్రభుత్వం అందిస్తున్న ఇళ్ల పట్టాలతో పాటు సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించాలన్నారు ,
ఇళ్ల పట్టాలు మంజూరు కానీ అర్హులను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువచ్చి రెండవ దఫా ఇళ్ల పట్టాల పంపిణీలో మంజూరు అయ్యేలా చూడాలని ఆయన సూచించారు ,అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో పని చేస్తున్నారని, ఏ ఒక్కరు కూడా ఇళ్ల పట్టా మంజూరు కాలేదని అధైర్యపడొద్దని ఆయన తెలిపారు , ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు ..

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *