Breaking News

ఉత్తమ సేవలకు ఆచార్యదేవోభవ అవార్డు ప్రదానం

తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధి నెర్నూరు ప్రాథమికోన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు రచయిత కొండూరు వెంకటేశ్వరరాజు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆచార్యదేవోభవ జాతీయ అవార్డును అందుకున్నారు. ఉపాధ్యాయునిగా, రచయితగా, సృజనచిత్ర కళాకారునిగా సామాజిక అభ్యుదయానికి రెండు దశాబ్దాలుగా ఆయన చేస్తున్న ఉత్తమ సేవలను ప్రశంసిస్తూ గుంటూరుకు చెందిన స్కోప్ ఫౌండేషన్ సేవా సంస్థ వారు 60 వ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇందుకు సంబంధించి నిర్వాహకులు అభినందనలతో పంపిన దృవపత్రాన్ని అంతర్జాలం ద్వారా బుధవారం అందుకున్నట్లు వెంకటేశ్వరరాజు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *