Breaking News

ఏపీకి ‘నివార్’ తుపాన్ ముప్పు

అమరావతి: రాష్ట్రానికి ‘నివార్’ రూపంలో మరో తుపాను  ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పాడిన  ‘నివార్’ సైక్లోన్‌తో ప్రభుత్వం అప్రమత్తమైంది. మరో 24 గంటల్లో వాయుగుండం తుఫాన్‌గా బలపడనున్న నేపథ్యంలో మూడ్రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. అలాగే ఈ నెల 25, 26వ తేదీలలో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచనుండటంతో… మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తుపాన్ ప్రభావిత ప్రాంతాల అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. వ్యవసాయ, వైద్య, రెవెన్యూ శాఖలను అధికార యంత్రాంగం అలర్ట్ చేసింది. తుపాన్ ముప్పుతో కోతకు సిద్ధంగా వరి, మినుము, పత్తి, పొద్దుతిరుగుడుకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా పంట కోతలు చేపట్టాలని రైతులకు అధికార యంత్రాంగం సూచనలు చేసింది. 

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *