Breaking News

ఏపీలో కరోనా: 5 జిల్లాల్లో 78శాతం కేసులు

బులెటిన్‌ విడుదల చేసిన వైద్యారోగ్య శాఖ

తెలుగు తేజం, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బారినపడుతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 31,116 పరీక్షలు నిర్వహించగా.. 1,288 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,04,548 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల అనంతపురం, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,225కి చేరింది.

24 గంటల వ్యవధిలో 610 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,88,508కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,815 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,51,46,104 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా గుంటూరులో 311, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1,288 మొత్తం కొవిడ్‌ కేసుల్లో 1,009 (78 శాతం) కేసులు కేవలం ఐదు జిల్లాల్లోనే నమోదు కావడం గమనార్హం.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *