Breaking News

కంచికచర్ల టౌన్ బిజెపి పార్టీ అధ్యక్షుడిగా : బోల్లం హరి

తెలుగు తేజం కంచికచర్ల : కంచికచర్ల టౌన్బి జెపి పార్టీ అధ్యక్షులుగా బోల్లం హరి (నర్సింహారావు) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నందిగామ నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ జంగం సునీల్ రాజు బుధవారం తెలిపారు. బిజెపి మరియు జనసేన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం మండల బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు కుప్పాల వెంకట లక్ష్మి స్వగృహమునందు మండల బిజెపి అధ్యక్షులు నన్నపనేని బాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా నందిగామ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ జంగం సునీల్ రాజ్ విచ్చేసారు ఈ సందర్భంగా జనసేన బిజెపి కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ బిజెపి జనసేన పార్టీల బలోపేతానికి ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన సూచించారు స్థానిక పంచాయతీ ఎన్నికల నందు నియోజకవర్గంలో అన్ని గ్రామా పంచాయతీ సర్పంచ్ తో పాటు అన్ని వార్డు నందు బిజెపి జనసేన కలిసి పోటీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఇరుపార్టీల నాయకులు సమాన్యంతో కలిసి కట్టుగా పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి యోక్క కార్యకర్త పాటుపడాలని ఆయన కార్యకర్తలకు సూచించారు తోలుతా ఈ కార్యక్రమంలో కంచికచర్ల టౌన్ బిజెపి అధ్యక్షులుగా బోల్లం హరి (నరసింహారావు) ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ మహిళా మోర్చా సెక్రటరీ హరి శ్రీదేవి, బిజెపి జిల్లా జనరల్ సెక్రెటరీ ఆర్మూగం, రాష్ట్ర ఎస్సీ మోర్చ కార్యదర్శి వై శ్రీనివాస్, మండల బిజెపి అధ్యక్షులు కృష్ణమూర్తి (బాబు) మండల బిజెపి మైనారిటీ అధ్యక్షులు షేక్ రఫీ, జనసేన నాయకులు నాయిని సతీష్, తోట ఓంకార్ తదితరులు పాల్గొన్నారు…

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *