Breaking News

కనకదుర్గమ్మ ఆలయంలో ఆకాశదీపం ఏర్పాటు

తెలుగు తేజం, విజయవాడ : కార్తీకమాస వేడుకలకు ఆహ్వానం పలుకుతూ ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి ప్రధాన ఆలయంతోపాటు మల్లేశ్వర ఆలయం నటరాజస్వామి ఆలయాల్లో ఆకాశ దీపాలను రుత్వికులు శాస్త్రం పరంగా ఆదివారం ఏర్పాటు చేశారు. ఆకాశంలో విహరించే దేవతలు పవిత్ర మాసం లో ఆదిదంపతులను దర్శించుకునేందుకు వీలుగా ఇలా దీపాలను సహాయంతో ఎత్తుగా ఏర్పాటు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో అఖండ దీపాన్ని ఏర్పాటు చేస్తారు. నెలరోజులపాటు మల్లేశ్వర స్వామి కి లక్ష బిల్వార్చన, సహస్రనామార్చన, అభిషేకాలు, నిర్వహించనున్నట్లు స్థాన ఆచార్య శివ ప్రసాద్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో సురేష్ బాబు దంపతులు మల్లేశ్వర ఆలయ ప్రధానార్చకులు మల్లయ్య శాస్త్రి ఏ ఈ ఓ రమేష్ వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాస్ శాస్త్రి, కోట ప్రసాద్ షణ్ముఖ శాస్త్రి పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *