Breaking News

కన్నులపండుగగా కూడరైవల్లి మహోత్సవం

తెలుగు తేజం, విజయవాడ : పాతబస్తీ బ్రాహ్మణవీధిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా కూడరైవలీ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాదేవి, పద్మావతి అమ్మవార్లను వేంచేయించి తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 108 చిన్ని గంగాళాల్లో S ప్రసాద నివేదన చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వైధిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ ఛైర్మన్‌ గుడిపాటి పాపారావు, కార్యనిర్వహణాధికారి గెల్లి హరిగోపీనా«ద్‌బాబు పర్యవేక్షించగా, అర్ఛకస్వాములు పరాశరం మురళీకృష్ణమాచార్యులు, పీ.రామచంద్రమూర్తి వైధిక కార్యక్రమాలను నిర్వహించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *