Breaking News

కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడి మృతి

దిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన పెద్ద కుమారుడు ఆశిష్‌ ఏచూరి (34) కరోనా వైరస్‌ బారిన పడి గురువారం మృతి చెందారు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి స్వయంగా ట్విటర్‌ వేదికగా ధ్రువీకరించారు. ‘ఈ విషయం తెలియజేయడానికి ఎంతో బాధగా ఉంది. కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడి నా పెద్ద కొడుకు ఆశిష్‌ ఈ ఉదయం మృతి చెందారు. మా కుమారుడిని బతికించేందుకు శ్రమించి చికిత్స అందించిన వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్‌ కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బందికి, ఈ ఆపత్కాలంలో మాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని ఏచూరి ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రధాని మోదీ సంతాపంఆశిష్‌ ఏచూరి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఈ బాధాకర సమయంలో ఏచూరి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు. సీపీఎం పొలిట్‌బ్యూరోతో పాటు కేరళ సీఎం పినరయి విజయన్‌, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *