Breaking News

కరోనాపై అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయుడు సుధాకర్

తెలుగు తేజం, నందిగామ : నందిగామ జర్నలిస్ట్ వెల్పేర్ అసోసియేషన్ కార్యాలయం కు ఉపాధ్యాయులు సుధాకర్ బుధవారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీ చేస్తున్నానని పేర్కొన్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ తరపున ఉపాధ్యాయుడు సుధాకర్ కు పెట్రోల్ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గంటా విజయకుమార్ కన్నెగంటి సజ్జన్ రావు పఠాన్ మీరా హుసేన్ ఖాన్ సింగంశెట్టి సత్యనారాయణ ఆకులు నారాయణ పారేపల్లి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *