Breaking News

కరోనా సోకిందంటూ వివక్ష.. వ్యక్తి ఆత్మహత్య

తెలుగు తేజం, గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెంలో విషాదం చోటుచేసుకుంది. కరోనా వచ్చిందనే భయంతో ఓ వృద్ధుడు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాసర్ల హరిబాబు (74) మూడు రోజులుగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. దీంతో చుట్టుపక్కల ఉన్నవారితో పాటు కుటుంబసభ్యులు సైతం హరిబాబుపై వివక్ష చూపడంతో ఆయన ఒత్తిడికి గురయ్యారు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకోకుండానే భయంతో స్థానిక చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే గన్నవరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *