Breaking News

నిరు పేద రైతు కు అండగా నిలిచిన తాసిల్దార్ రామకృష్ణ

దళారీ వ్యవస్థ నుండి రైతు కు విముక్తి
ధాన్యం కొనుగోలు చేస్తామని రైతును మోసగించిన దళారుల పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. తాసిల్దార్

తెలుగు తేజం, జగ్గయ్యపేట : కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన ఓ రైతు ఆరుగాలం పండించిన వరి పంటను తన కల్లం వద్ద వ్యాపారులు ఇష్టానుసారంగా రేట్లు నిర్ణయించి దాన్యం కొనుగోలు చేస్తామని మోసగించిన సంఘటన తెలుసుకున్న తాసిల్దార్ రామకృష్ణ హుటాహుటిన ఆర్ ఐ శ్రీనివాసరావును రైతు ధాన్యం వద్దకు విచారణకు పంపగా రైతు జరిగిన విషయాన్ని తెలియజేశారు ఆ రైతులు వ్యాపారులు ఏ విధంగా మానసికంగా మనోవేదనకు గురిచేశారో తెలియజేసి తన ఆవేదన వ్యక్తం చేశారు రైతు వద్ద సమాచారం తీసుకున్న తాసిల్దార్ కార్యాలయం బృందం సంబంధిత సమాచారం ఉన్నతాధికారులకు పంపి ఎవరైతే ఆ రైతును దాన్యం కొనుగోలు చేస్తాం అంటూ నాలుగు రోజులపాటు కొనుగోలు చేయకుండా మనోవేదనకు గురి చేశారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రైతుకు భరోసా కల్పించారు రైతు ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయించి రైతుకు సరైన న్యాయం చేసిన తహసీల్దార్ రామకృష్ణ కు గ్రామ పెద్దలు రైతులు ప్రముఖులు పాత్రికేయులు అభినందనలు తెలియజేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *