Breaking News

కళ వెంకట్రావు అరెస్ట్ ను ఖండిస్తూ నిరసన

తెలుగు తేజం, నందిగామ టౌన్ : తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు కళ వెంకట్రావు ను అర్ధరాత్రి అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య తెదేపా నాయకులతో కలిసి నందిగామ గాంధీ సెంటర్ నందు నిరసన తెలియజేసారు
ఈ సందర్బంగా సౌమ్య మాట్లాడుతూ రోజు రోజు కి జగన్మోహన్ రెడ్డి సైకోతత్వం ముదిరి పోతోందని అయన ఎం చేస్తున్నాడో ఆయనకే అర్ధం కావడం లేదని, పరిపాలన మీద ద్రుష్టి పెట్టటం చేతకాక తాను జైలుకు వెళ్ళాడు అని రాష్ట్ర ప్రజలను,నాయకులను ముఖ్యంగా బి.సి నాయకులను జైలులో పెట్టాలనే లక్ష్యంగా అయన పాలన కొనసాగుతోందని మొన్న అచ్చెన్నాయుడు, నిన్న కొల్లు రవీంద్ర , ఈ రోజు కళ వెంకట్రావు మీద వరుసగా బి.సి నేతల మీద దాడి చేస్తూ అన్యాయంగా అరెస్ట్ చేయడం చూస్తున్నామని హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా రామతీర్ధం లో ఆలయాల మీద దాడులు జరిగాయి రెండు రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఎం చేసింది. విజయసాయి రెడ్డి రెచ్చెగొట్టటం వలన అక్కడ గొడవలు జరిగాయి..
డి.జి.పి గారు మీరు ఐపీఎస్ చదివారు మీ చదువు ఎం అయ్యింది?ఈ రోజు మీరు ప్రభుత్వానికి ఒక దాసోహం లా, తొత్తులా తయారయ్యారు .. తెలుగుదేశం పార్టీ నేతలే లక్ష్యంగా అరెస్ట్ లు జరుగుతున్నాయి లా అండ్ ఆర్డర్ ఒక పక్షానే ఉన్నట్లుగా ఉంది.. ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు అనుమతులు ఇవ్వకపోతే పాదయాత్రలు చేసేవారా, ముఖ్యమంత్రి అయ్యేవారా? ఈ రోజు హై కోర్ట్ లో ఎన్నికలు జరపడానికి గ్రీన్ సిగ్నల్ రావడం శుభపరిణామము రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక చెంప పెట్టు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మీ సైకో తత్వం విడనాడి పాలన పై ద్రుష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *