Breaking News

కృష్ణా నదికి భారీగా వరద నీరు : కలెక్టర్‌ ఇంతియాజ్

నదికి సమీపంలో ఉండటం సురక్షితం కాదు
జగ్గయ్యపేట నుంచి నదీ పరీవాహకంలోని 18 మండలాలు మరింత అప్రమత్తంగా ఉండాలి

తెలుగు తేజం, విజయవాడ: కృష్ణా నదికి భారీగా వరద నీరు చేరే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నేటి సాయంత్రానికి వరద పెరిగే అవకాశముందని చెప్పారు. ఊహించని రీతిలో భారీగా వరద వస్తోందన్నారు. బ్యారేజీ నుంచి ప్రస్తుతం 7.50లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని.. వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదిలేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. 9 లక్షల క్యూసెక్కుల వరకు వరద వచ్చే అవకాశం ఉన్నందున నదికి సమీపంలో ఉండటం సురక్షితం కాదని హెచ్చరించారు.
లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని.. జగ్గయ్యపేట నుంచి నదీ పరీవాహకంలోని 18 మండలాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దన్నారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని అప్రమత్తం చేశామని కలెక్టర్‌ తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *