Breaking News

ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాం: నాగేంద్ర

విజయవాడ: ఏపీలో సంచలనం రేకెత్తిన దివ్య తేజస్విని హత్య కేసు మలుపులు తిరుగుతోంది. తేజస్విని గొంతు తాను కోయలేదని స్వామి అలియాస్ నాగేంద్ర తెలిపాడు. ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నామని చెప్పాడు. ఎవరి గొంతు వాళ్లు కోసుకున్నామని తెలిపాడు.
నిన్నటి వరకు ప్రేమోన్మాది దాడి అంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో నాగేంద్రకు, తేజస్వినికి గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. లాక్ డౌన్ సమయంలో పెళ్లి కూడా చేసుకున్నట్లు నాగేంద్ర తెలిపాడు. క్రీస్తు రాజపురంలో ఉంటున్న తేజస్వినితో 3ఏళ్లుగా పరిచయం ఉందని, ఆ పరిచయం ప్రేమగా మారిందని, ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలుసునని, ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో తేజస్విని కుటుంబసభ్యులు తమ పెళ్లికి అంగీకరించలేదన్నాడు. దీంతో రహస్యంగా వివాహం చేసుకున్నామని నాగేంద్ర చెప్పాడు.

పెళ్లి విషయం తేజస్విని తల్లిదండ్రులకు కూడా తెలుసునని, దీనిపై గత కొన్ని రోజులుగా గొడవ జరుగుతుందని నాగేంద్ర తెలిపాడు. దీంతో తేజస్వినీని ఆమె కుటుంబ సభ్యులు ఇంట్లో నిర్బంధించి బయటకు రాకుండా చేశారని, ఈ నేపథ్యంలో ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని అనుకుని నిన్న ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నామని నాగేంద్ర తెలిపాడు. ఆ తర్వాత తాను స్పృహ తప్పి పడిపోయానని, తర్వాత తన చేతికి ఎలా గాయం అయ్యిందో తెలియదని చెప్పాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *