Breaking News

ప్రారంభమైన బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ : ప్రారంబించిన నితిన్ గట్కారి , ఏపీ సీఎం జగన్

తెలుగు తేజం , అమరావతి: విజయవాడకు మకుటాయమానంగా నిలవనున్న కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభమైంది. వర్చువల్‌ విధానం ద్వారా కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ఏపీ సీఎం జగన్‌ దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీనితో పాటు రాష్ట్రంలోని 9 జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు 16 వంతెనలకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. వాటి మొత్తం విలువ రూ. 15,592 కోట్లు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వీకే సింగ్‌, కిషన్‌రెడ్డి, ఏపీ మంత్రి శంకర నారాయణ, ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌, సీఎం రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

2.6 కి.మీల పొడవున్న కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని 2015లో ప్రారంభించారు. దీనికి మొత్తం రూ.502 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కేంద్రం వాటా రూ.355.8 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.146.2కోట్లు ఖర్చు చేసింది. 900 పనిదినాల్లో ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని పూర్తి చేశారు. కేవలం 12 నెలల్లోనే నిర్మాణం చేస్తామని గుత్త సంస్థ ఇచ్చిన హామీ నిలుపుకోలేకపోయింది. ఎలివేటెడ్‌ వంతెనలు సాధారణంగా నాలుగు వరసలే ఉంటాయి. కానీ కనకదుర్గ పైవంతెన ఆరు వరసలుగా నిర్మాణం చేయడంతో దక్షిణాదిలో తొలి ప్రాజెక్టుగా, దేశంలో మూడో ప్రాజెక్టుగా రికార్డుకెక్కింది. తొలి రెండు ఆరు వరసల పైవంతెనలు ముంబయి, దిల్లీలో ఉన్నాయి.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *