Breaking News

కొండచరియలు విరిగిపడకుండా చర్యలు తీసుకుంటాం: కొట్టు సత్యనారాయణ

విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఇంద్రకీలాద్రి దిగువున కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండచరియలు విరిగిపడటంతో ఐఐటీ చైన్నై జియాలజీ అధ్యాపకులు డా.మాధవ్, అలాగే మైనింగ్ అధికారులతో మాట్లాడామన్నారు. డా.మాధవ్ సలహాలతో కొండ చరియలు విరిగిపడకుండా భద్రత చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దసరా ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. వర్షం కురిసిన సమయంలో వర్షపు నీరు పోయేందుకు ఘాట్ రోడ్డులోని ప్రత్యేకంగా గట్టు నిర్మాణం చేస్తున్నామన్నారు. ఈ మేరకు పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి వెల్లడించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *