Breaking News

లండన్ పర్యటన ముగించుకొని ఏపీకి చేరుకున్న సీఎం జగన్

గన్నవరం : లండన్ పర్యటన ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డి నేడు ఏపీకి చేరుకున్నారు. వారికి స్వాగతం పలికేందుకు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ పి.జాషువా , మంత్రులు జోగి రమేష్, పిన్నిపే విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ విఫ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ బాలశౌరి, నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి, వల్లభనేని వంశీ కొలుసు పార్థ సారథి, మల్లాది విష్ణు తదితరులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్ మార్గాన తమ నివాసానికి సీఎం జగన్ బయలుదేరారు. సీఎం రాకతో ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా పోలీస్ బందోబస్తుతో కట్టుదిట్టం చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *