Breaking News

కొండపల్లి లో భారీ అగ్నిప్రమాదం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్

తెలుగు తేజం, మైలవరం : కృష్ణాజిల్లా మైలవరం నియోజక వర్గం కొండపల్లిలోని మెయిన్ రోడ్లో గల కేబుల్ ఆఫీసులో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం లో కేబుల్ కు సంబందించిన పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. సుమారు కోటి రూపాయల నష్టం వాటిల్లిందని కేబుల్ ఆఫీస్ యాజమాన్యం తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణం షార్ట్ సర్క్యూటే నని అధికారులు చెపుతున్నారు. ప్రాణ నష్టం ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రూంలో కేబుల్స్ మేడం తో ఉండడంతో మంటలు ఎగిసిపడ్డాయి అగ్నిమాపక సిబ్బంది మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాద విషయం తెలిసిని మైలవరం శాసన సభ్యులు వట్టి వెంకట కృష్ణ ప్రసాద్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *