Breaking News

కోడి పందాలకు చెక్ పెట్టిన కంచికచర్ల పోలీసులు

తెలుగు తేజం, కంచికచర్ల : కోడి పందాల కోసం ఏర్పాటు చేసిన వారికి పోలీసులు చెక్ పెట్టారు. కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామ శివారులో కోడి పందాల కోసం ఏర్పాటు చేసిన బరులను పోలీసులు ధ్వంసం చేశారు. పెండ్యాల గ్రామ శివారు మామిడి తోటల్లో కోడి పందాల బరులు ఏర్పాటు చేసినట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. నందిగామ రూరల్ సర్కిల్ పరిధిలో 21 కేసుల్లో 42 మందిని బైండోవర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

About The Author

Related posts