Breaking News

క్రైస్తవ జీవితం ప్రపంచానికి దిక్సూచి : డాక్టర్ మొండితోక అరుణ కుమార్

తెలుగు తేజం, కంచికచర్ల : కంచికచర్లలోని అరుంధతి నగర్ నందు పాస్టర్ మాడుగుల రాజేష్ చేత నూతనంగా నిర్మించబడిన షాలేము ప్రార్థనా మందిర ప్రతిష్ట కార్యక్రమము నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొక్కా జార్జి ముల్లర్ అధ్యక్షతన జరిగినది. విజయవాడకు చెందిన పాస్టర్ విల్సన్ ప్రారంభించినారు. ఈ కార్యకమానికి వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆయన మాట్లాడుతూ ప్రతి క్రైస్తవుడు ప్రేమతో, తనను తాను తగ్గించుకుని, ఇతరులకు సేవ చేసి, జీవించాలని క్రైస్తవ జీవితం ప్రపంచానికి దిక్సూచి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి కంచికచర్ల పట్టణ అధ్యక్షులు వేమా సురేష్, కంచికచర్ల మండల నాయకులు మార్తా శ్రీనివాసరావు, వేల్పుల ప్రశాంతి,శ్రీను,నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు పాల్ శంకర రెడ్డి, హానోకు, విల్సన్, శాంతయ్య, ఇమ్మానుయేలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చర్చి నిర్వాహకులైన మాడుగుల రామ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులైన డాక్టర్ మొండితోక అరుణ కుమార్, కంచికచర్ల పట్టణ అధ్యక్షులు వేమా సురేష్, డాక్టర్ జార్జి ముల్లర్,పాస్టర్ విల్సన్
తదితరులు ఘనంగా సన్మానించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *