Breaking News

గన్నవరం -నూజివీడు ప్రధాన రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొడాలి నాని


గన్నవరం తెలుగు తేజం జూలై 20:కృష్ణాజిల్లా గన్నవరం మండలం బహుబలేంద్రనిగూడెం వద్ద గన్నవరం- నూజివీడు రహదారి అభివృద్ధి పరిచేందుకు ఏర్పాటు చేసిన శంకుస్థాపన పూజ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) ,ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పాల్గొన్నారు. నేషనల్ డెవలప్ మెంట్ బ్యాంకు 29కోట్ల 68 లక్షల రూపాయల నిధులతో గన్నవరం నుంచి సుమారు 9.4 కిలోమీటర్ల మేరా రహదారి అభివృద్ధి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బిబిగూడెం సర్పంచ్ దొప్పలపూడి విజయలక్ష్మి, ఆర్ అండ్ బి ,వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు , సర్పంచులు , వైకాపా నాయకులు , కార్యకర్తలు ,గ్రామస్థులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *