Breaking News

గోపినేనిపాలెం గ్రామంలో వైయస్సార్ బీమా నగదును అందించిన సర్పంచ్ బాణావతు శ్రీనివాసరావు

తెలుగు తేజం, వత్సవాయి :వత్సవాయి మండలంలోని గోపినేనిపాలెం గ్రామంలో మేరావతు కృష్ణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అతని కుటుంబానికి వైయస్సార్ బీమా పథకం ద్వారా మట్టి ఖర్చులు నిమిత్తం పదివేల రూపాయలను మేరావతు నాగమణి ( భార్య) కు సర్పంచ్ బాణావతు శ్రీనివాసరావు చేతుల మీదగా బుధవారం స్థానిక సచివాలయం నందు అందించారు. మిగతా రూ. 1,90,000 నామిని ఎకౌంట్లో జమ అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ పి ఎం నాగరాజు, డిజిటల్ అసిస్టెంట్ అశోక్, వెల్ఫేర్ అసిస్టెంట్ ఉపేంద్ర, వివో శిరీష, వాలెంటరీ శివలీల, మహిళా పోలీస్ కర్రీ మూన్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *