Breaking News

గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

తెలుగుతేజం, ఇబ్రహీంపట్నం: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక రింగ్ సెంటర్ లో శుక్రవారం గ్యాస్ సిలిండర్ తో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు ఎం.మహేష్ మాట్లాడుతూ బీజేపీ అధికారం కేవలం కార్పొరేట్ కంపెనీ లాభాల కోసమే తప్ప పేద ప్రజల సంక్షేమ, అభ్యున్నతికి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలలో గ్యాస్ పై రూ.100 పెంచి సామాన్యుల నడ్డి విరిచారని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ధరలు తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *