Breaking News

ఘనంగా దైవ సేవకుల గ్రాండ్ సెమి క్రిస్మస్ వేడుకలు

ముఖ్య అతిదుల్లా ఎమ్మెల్యే డా. మొండితోక జగన్ మోహన్ రావు , డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్
దైవ సేవకులకు నూతన వస్త్రాలను పంపిణీ చేసిన MLA సోదరులు ..

తెలుగు తేజం, నందిగామ : పట్టణంలోని ఆర్ ఎస్ గార్డెన్స్ లో కీ”శే” కస్తాల మరియమ్మ ఆశీస్సులతో నిర్వహించిన దైవ సేవకులకు గ్రాండ్ సెమి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి , సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే సోదరులు మాట్లాడుతూ తమ మాతృమూర్తి కస్తాల.మరియమ్మ ప్రభు యేసును ఎంతగానో విశ్వసించి ప్రార్థనలు చేసేవారని , ఆమె నిత్యం బైబిల్ చదువుతూ దానిలోని సారాంశాన్ని మాకు బోధించేదని ,పేదలకు, ప్రజలకు సేవ చేస్తూ ఎలా జీవించాలో తమకు నేర్పిందని ,తమ తల్లి ఆశయ సాధన కోసమే రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజలకు తోడునీడగా ఉంటామన్నారు. అదేవిధంగా కంచికచర్ల పట్టణంలో క్రైస్తవుల అభ్యర్థన మేరకు స్మశాన వాటిక ఏర్పాటుతో పాటు ,నందిగామలో స్మశాన వాటిక ఏర్పాటుకు స్థల సేకరణ చేస్తున్నట్లు ,క్రైస్తవుల మరణానంతరం అంతిమయాత్రకు ప్రత్యేక వాహనాన్ని కుాడా అందజేస్తామని ,నందిగామ నియోజకవర్గంలోని చర్చిల వద్ద తాగునీటి సౌకర్యాలు కల్పించడానికి ప్రత్యేక ఏర్పాటు చేస్తామని ,తమ మాతృమూర్తి మరియమ్మ గారి పేరిట సొంత ఖర్చుతో దైవ సేవకులకు ఇళ్ల స్థలాలు అందజేసి కాలనీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం దైవ సేవకులను ఘనంగా సత్కరించి ,నూతన వస్త్రాలను అందజేశారు .

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *