Breaking News

ఘనంగా నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి వేడుకలు

తెలుగు తేజం, విజయవాడ : ప్రముఖ పారిశ్రామిక వేత్త కోగంటి సత్యం ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ నందమూరి తారకరామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా స్థానిక దుర్గా కళామందిర్ థియేటర్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన పలు సంక్షేమా పథకాలు ఇప్పటికి పేదవాడి గుండెల్లో స్థిరస్థాయిగ నిలిచాయని ఆయన అన్నారు. నేటి తరం రాజకీయ నేతలు ఎన్టీఆర్ ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మాజీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ మండాపు వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *