Breaking News

ఘనంగా వార్డుల్లో ప్రచారం

తెలుగు తేజం, కంచికచర్ల పట్టణంలో వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి వార్డు మెంబర్ అభ్యర్థులు పట్టణంలో మంగళవారం నాడు పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దేవినేని చంద్రశేఖర్, వేమ సురేష్, వేల్పుల శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంచికచర్ల పట్టణంలోని సర్పంచ్ అభ్యర్థి తో పాటు 20 వార్డులకు 20 వార్డులు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్ రావు మరియు అరుణ్ కుమార్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమ విజయానికి సోపానాలు గా నిలుస్తాయని తెలియజేశారు. తొలిదశలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందజేశామని మరికొంతమంది లబ్ధిదారులకు రానున్న రెండు దశల్లో ఇళ్ల పట్టాలు అందజేసి ప్రతి పేదవాడికి సొంతింటి కల నిజం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నన్నపనేని నరసింహరావు, సర్పంచ్ అభ్యర్థి వేల్పుల సునీత 20 వార్డు లో పోటీ చేసే వార్డు అభ్యర్థులు పాల్గొని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *