Breaking News

చందర్లపాడులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా.మొండితోక జగన్ మోహన్ రావు , జిల్లా కలెక్టర్ ఇంతియాజ్

తెలుగు తేజం, చందర్లపాడు : చందర్లపాడు గ్రామంలో NRUM నిధులు రూ.90.00 లక్షల రూపాయల అంచనా విలువ తో నూతనంగా నిర్మించనున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి, నాబార్డ్ RIDF XXV నిధులు రూ.”1.14.30 లక్షల అంచనా విలువతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు, MGNREGS నిధులు రూ.61.80 లక్షల అంచనా విలువతో నూతనంగా నిర్మించనున్న గ్రామ సచివాలయ భవనం-3 మరియు రైతు భరోసా కేంద్రం-3 భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తో కలిసి ఎమ్మెల్యే డా. జగన్ మోహన్ రావు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి నందిగామ నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని ,ఆయన సహకారంతో మండల కేంద్రమైన చందర్లపాడు గ్రామంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుతో పాటు ,నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *