Breaking News

చంద్రబాబు క్షేమం కోరుతూ రిషికేష్ లో కేశినేని నానీ హోమం

విజయవాడ: ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశిసినేని శ్రీనివాస్ రిషికేష్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యోగక్షేమాల కోసం పవిత్ర పుణ్యక్షేత్రం రిషికేష్ లో మంగళవారం ఎంపీ కేసినేని దంపతులు పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

దేశంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం రిషికేష్ లో పవిత్ర గంగా నదీ తీరాన నారా చంద్రబాబు నాయుడు కి మంచి జరగాలని కోరుతూ పూజ హోమాది కార్యక్రమాలను ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) పావని దంపతులు ప్రత్యేకంగా నిర్వహించారు. పూజా హోమాది కార్యక్రమాల అనంతరం పవిత్ర గంగానది హారతిలో పాల్గొని చంద్రబాబు నాయుడు కుటుంబానికి ధైర్యం కలగాలని కేశినేని నాని దంపతులు ప్రత్యేకంగా ప్రార్ధనలు చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *