Breaking News

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

చిత్తూరు : ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ లారీ ముందున్న కార్మికుల వ్యాన్‌ను ఢీకొట్టడం దాని ముందున్న ద్విచక్రవాహనం, కారును ఢీ కొనడంతో నలుగురు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా నగరి మండలం ధర్మపురం వద్ద రహదారి పై శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు నుంచి నగరికి వెళ్తున్న లారీ ధర్మపురం వద్ద రహదారి డివైడర్లకు కలర్‌వేస్తున్న కార్మికుల వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ వ్యాన్‌ ముందుకెళ్లి ద్విచక్రవాహనాన్ని, కారును ఢీ కొనడంతో నలుగురు చనిపోగా మరో నలుగురు తిరుపతి, నగరి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *