Breaking News

“జగనన్న తోడు” పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా. మొండితోక. జగన్ మోహన్ రావు

తెలుగు తేజం, కంచికచర్ల : కంచికచర్ల పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా”జగన్ మోహన్ రావు లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి జగనన్న తోడు పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నారని తెలిపారు. ,ఈ పథకం కింద నందిగామ నియోజకవర్గంలో దాదాపు 2,200 మంది , కంచికచర్ల మండలంలో 928 మంది చిరు వ్యాపారులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. దాదాపు 10 లక్షల మంది చిరువ్యాపారులకు “జగనన్న తోడు” పథకం ద్వారా రూ. 10వేల చొప్పున వడ్డీలేని రుణాలు పంపిణీ చేస్తున్నామన్నారు. బడుగు బలహీనవర్గాల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *