Breaking News

జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్బంగా ట్రై సైకిళ్ళు,చీరల పంపిణీ చేసిన వసంత కృష్ణ ప్రసాదు

తెలుగు తేజం, ఇబ్రహీంపట్నం : జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్బంగా కొండపల్లి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రక్తదాతలను ప్రత్యేకంగా అభినందించారు. వికలాంగులకు ట్రై సైకిళ్ళు చేసారు. ఈ సందర్బంగా కొండపల్లి కి చెందిన దాత యం రవీంద్ర సహకారంతో ఏర్పాటుచేసిన ట్రై సైకిళ్ళును వికలాంగులకు అందజేశారు.పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం బి కాలనీలో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద స్థానిక నాయకుల అద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేదలకు చీరలు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా మహనేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రక్తదాతలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *