Breaking News

జగ్గయ్యపేట లో కృష్ణా జలాల ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ

తెలుగు తేజం, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట పట్టణ సమీపంలోని పద్మావతి నగర్ లోగల హెడ్ వాటర్ వర్క్స్ వద్ద కృష్ణానది జలాలతో జగ్గయ్యపేట పట్టణమునకు రూ. 18.90 కోట్లతో నిర్మించిన మంచినీటి సరఫరా అభివృద్ధి పథకానీ, జగ్గయ్యపేట పట్టణంలోని నెహ్రూ చౌక్ వద్ద ఆసియా మౌలిక సదుపాయాల అభివృధ్ధి బ్యాంక్ ద్వారా (AIIB) రూ. 33.99 కోట్ల నిధులతో సమగ్ర మంచినీటి సరఫరా అభివృధ్ధి పథకానికి ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ది మంత్రి బొత్స సత్యనారాయణ. శంఖుస్థాపన చేసారూ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వవిప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, నందిగామ ఎమ్మెల్యే డా” మొండితోక జగన్ మోహన్ రావు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొననున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *