Breaking News

టీఎస్‌పీఎస్‌సీ తాత్కాలిక ఛైర్మన్‌గా సాయిలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) తాత్కాలిక ఛైర్మన్‌గా సీహెచ్ సాయిలు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్న కృష్ణారెడ్డి పదవీకాలం ఈనెల 18న ముగిసింది. టీఎస్‌పీఎస్‌సీ సభ్యుల్లో ప్రస్తుతం సాయిలు ఒక్కరే ఉన్నారు. సభ్యుడిగా సాయిలు పదవీకాలం నవంబరు 1 వరకు ఉంది. పూర్తిస్థాయి ఛైర్మన్‌ను నియమించే వరకు లేదా సాయిలు పదవీకాలం ముగిసేవరకు ఆయన తాత్కాలిక ఛైర్మన్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో సాయిలు ఇవాళ కమిషన్‌ తాత్కాలిక ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *