Breaking News

తమిళనాడు తీరం వైపు దూసుకొస్తున్న నివర్‌

అమరావతి: నివర్‌ తుపాను తమిళనాడు తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వాయువ్యదిశగా కదులుతోంది. ప్రస్తుతం తమిళనాడులోని కడల్లోర్‌కు 300 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు ఐఎండీ తెలిపింది. కొద్ది గంటల్లో పెనుతుపానుగా బలపడనుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ రోజు రాత్రికి మామల్లాపురం-కలైకర్ వద్ద తీరం దాటుతుందని స్పష్టం చేసింది.

దీని ప్రభావంతో ఇప్పటికే చెన్నై సహా తమిళనాడులోని కోస్తాజిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో 12 సెం.మీ వర్షం నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తో జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. నెల్లూరు, చిత్తూరు తదితర ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. తుపాను ప్రభావంతో తీర ప్రాంతంలో 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, అలలు 3 నుంచి 5 మీటర్ల ఎత్తు ఎగసిపడుతున్నాయని అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపునీరు చొచ్చుకొచ్చే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *