Breaking News

పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలలో రవాణా చేస్తే కఠిన చర్యలే : రూరల్ సీఐ సతీష్

తెలుగు తేజం, నందిగామ : కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు నందిగామ డి.ఎస్.పి నాగేశ్వర్ రెడ్డి సారథ్యంలో నందిగామ రూరల్ సీఐ సతీష్ కంచికచర్ల ఎస్సై రంగనాథ్ వారి సిబ్బందితో కలిసి కంచికచర్ల పట్టణంలో గల చెవిటికల్లు సెంటర్ జుజ్జూరు రోడ్డు గొట్టుముక్కల రోడ్డు నందిగామ వెళ్లే ఆటో స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లతో సీఐ సతీష్ మాట్లాడుతూ ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని రాదని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఆటో రవాణా కి సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని, యూనిఫామ్ తప్పనిసరి అని, వ్యవసాయ కూలీలను పరిమితికి మించి రవాణా చేయరాదని అట్టి వారి పై జరిమానా విధించడం ఏ కాక చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పరిమితికి మించి ప్రయాణికులను రవాణా చేస్తున్న ఆటో సీజ్ చేయబడుతుందని హెచ్చరించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *