Breaking News

దళితవాడ శ్మశాన వాటికకు చుట్టూ ప్రహరీ గోడ నిర్మించండి

కొండపల్లి మున్సిపల్ కమీషనర్ పర్వతనేని శ్రీధర్ కి వినతిపత్రం ఇచ్చిన ఏపీ ఎమ్మార్పీఎస్ మరియు దళిత సంఘాల నేతలు

తెలుగు తేజం, ఇబ్రహీంపట్నం : శక్తీ నగర్ , భీమరాజు గుట్ట దళితవాడ శ్మశాన వాటికకు చుట్టూ ప్రహరీ గోడ నిర్మించమని కొండపల్లి మున్సిపల్ కమీషనర్ పర్వతనేని శ్రీధర్ కి వినతిపత్రం ఇచ్చిన ఏపీ ఎమ్మార్పీఎస్ మరియు దళిత సంఘాల నేతలు. ఏపీ ఎమ్మార్పీఎస్,దళిత సంఘాల నేతలతో కొండపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ 15 ఆర్ధిక సంఘం నిధులతో SC బరియల్ గ్రౌండ్ చుట్టూ ప్రహరీ గోడ వెంటనే నిర్మించమని మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేసించారని తెలియ జేసారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎమ్మార్పీఎస్ కృష్ణా జిల్లా అధ్యక్షులు మందా నాగ మల్లేశ్వరరావు,ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు నల్లమోతు సురేష్,వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణాజిల్లా యువజన విభాగం నాయకులు నల్లమోతు మధుబాబు,మాల మాహానాడు నాయకులు కోలకానీ శ్రీనివాసరావు,ఏపీ ఎమ్మార్పీఎస్ భీమరాజు గుట్ట నాయకులు పాగోలు నాగరాజు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *