Breaking News

దుర్గమ్మ ను దర్శించుకొన్న దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌

తెలుగు తేజం, విజయవాడ : రాష్ట్ర దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులైన ఐఏఎస్‌ అధికారిణి వాణీమోహన్‌ బాధ్యతలు చేపట్టిన అనంతరం సోమవారం ఇంద్రకీలాద్రికి వచ్చి కనకదుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. ఆమెకు దేవస్థానం కార్యనిర్వాహక ఇంజనీరు డి.వి.భాస్కర్‌, వైదిక కమిటీ సభ్యుడు శ్రీనివాసశాస్త్రి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు. అనంతరం మల్లేశ్వరస్వామిని దర్శించుకున్న ముఖ్యకార్యదర్శి వాణీమోహన్‌ దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్నదానంలో పాల్గొని అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఆలయంలో జరిగే నిత్య కార్యక్రమాలు, అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *