Breaking News

దేశవ్యాప్త సమ్మె లో భాగంగా సిపిఎం, సిఐటియు పార్టీ నాయకులకు ముందస్తు నోటీసులు లు

తెలుగు తేజం, కంచికచర్ల : పని చేసుకుని బతికే కార్మికుడికి సమస్యలు పరిష్కరించాలని ప్రదర్శన చేయడానికి ఆంక్షలు హౌస్ అరేస్టులు
అదే రాజకీయ నాయకుడు వాళ్ళ పార్టీ సంక్షేమ కార్యక్రమాలపేరుతో ఎంతమంది కైనా వారికి పరిమిషన్ ఉంటుంది వారికి కరోనా నిబంధనలు పని చేయవు పనిలేదు మహాప్రభో మాకు పని చూపించండి అని అడిగే కార్మికులు నిర్దాక్షిణ్యంగా హౌస్అరెస్టు చేయటం ఎంతవరకు సమంజసంకార్మికుడికి పోట్ట గొట్టిన ఏప్రభుత్వము ముందుకెళ్ళి నా దాఖలాలు లేవు చరిత్ర చూసుకోండి కార్మికుల కంట నీరు ఎవరికైనా శాపమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం న్నర దాటుతున్న కార్మికుల గురించి పట్టించుకోని ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం మాట్లాడని ప్రభుత్వం కార్మికులసమస్యల పరిష్కారం కోసం చేసే కార్యక్రమాలను అడ్డుకోవటానికి కార్మికుల జీవితాలు నాశనం చేయటానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటుంది.
సిపిఎం పార్టీ సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు నాయకులకు ముందస్తు నోటీసులు అందచేశారు. నోటీసులు అందుకున్న నాయకులు కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జి హరికృష్ణ రెడ్డి కంచికచర్ల మండలం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ ఖాసిం, కాశి బోయిన రాంబాబు. కంచికచర్ల మండలం సిఐటియు అధ్యక్షులు బెజ్జం భూషణం మరియు లాల్ మహమ్మద్ గౌస్ సిఐటియు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *