Breaking News

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ వ్యక్తి దుర్మరణం

తెలుగు తేజం, విజయవాడ : ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది ఈ సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కృష్ణ జిల్లా విజయవాడ నగర శివారు మైలవరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ రూరల్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నరేంద్ర కొత్తూరు నుండి విజయవాడ వైపు మోటార్ బైక్ పై వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ టైర్ కింద పడి నరేంద్ర అక్కడిక్కడే మృతి చెందాడు. రోడ్డు గుంతలు గా ఉండడంతో ఇటువంటి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న టూ టౌన్ కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *