Breaking News

నందిగామలో ఘనంగా వై.యస్.షర్మిళ జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్..

తెలుగు తేజం, నందిగామ : రాష్ట్ర రాజకీయాలలో షర్మిళ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పేర్కొన్నారు. నందిగామ పార్టీ కార్యాలయంలో గురువారం వై.యస్.జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిళ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మహిళలు ,పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు , ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో షర్మిళ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ,చిన్న వయసులోనే మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఏ మహిళా సాధించలేని ఘనతను సాధించారన్నారు ,షర్మిళ ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ,
మహానేత అడుగుజాడల్లోనే సంక్షేమ పాలన :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లోనే నడుచుకుంటూ ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారని అరుణ్ కుమార్ పేర్కొన్నారు ,గడిచిన ఎన్నికల సమయంలో సైతం షర్మిళ విస్తృతంగా పర్యటించి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు ,పాదయాత్రలో -ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తూ ప్రజా మన్ననలు పొందుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు మండవ పిచ్చయ్య ఆవుల విజయ్ వేల్పుల శేషగిరిరావు మాడుగుల నాగ రత్నం వేల్పుల ప్రశాంతి కంచి చర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ మార్తా రజిని తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *