Breaking News

నిందితుడిని పట్టిస్తే రూ.50వేల నజరానా

తెలుగు తేజం మచిలీపట్నం, అవనిగడ్డ : అవనిగడ్డకు చెందిన శ్రీలక్ష్మీ నర్సింగ్‌ హోమ్‌ వైద్యులు కోట శ్రీహరిరావు హత్య కేసులో నిందితుడ్ని పట్టించిన వారికి రూ.50వేలు నజరానా అందిస్తామని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం సీసీ ఫుటేజీల్లో రికార్డు అయిన ప్రధాన అనుమానితుడు చిత్రాలను విడుదల చేశారు. నిందితుడి వివరాలు తెలిసిన వారు అవనిగడ్డ పోలీసుస్టేషన్‌లో సమాచారం అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *